
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలి ఉమెన్ పోలీస్ స్టేషన్ఎస్ఐ రెడ్హ్యాండెడ్ ఏసీబీకి చిక్కాడు. పీఎస్లో నమోదైన కేసులో తన తల్లి పేరు తొలగించాలని ఓ వ్యక్తి కోరగా, ఎస్ఐ కె.వై వేణుగోపాల్రూ.25 వేల లంచం డిమాండ్చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. గురువారం సాయంత్రం పోలీస్స్టేషన్లో బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా, ఎస్ఐను రంగారెడ్డి జిల్లా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంతరం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.