ఏసీబీ వలలో సీనియర్ పెద్ద అంబర్ పేట విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్

ఏసీబీ వలలో సీనియర్  పెద్ద అంబర్ పేట విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్
  • ట్రాన్స్​ఫార్మర్​, కరెంట్​ మీటర్ల ఏర్పాటుకు లంచం డిమాండ్

అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేట సబ్ స్టేషన్​లో సీనియర్ లైన్ ఇన్ స్పెక్టర్ ప్రభులాల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. తట్టి అన్నారంలో గల శ్రేయాస్​ కాలేజీ సమీపంలో కొత్తగా నిర్మించిన అపార్ట్ మెంట్ కు సంబంధించి 63 కేవీ ట్రాన్స్​ఫార్మర్, కరెంట్​ మీటర్ల ఏర్పాటు కోసం ఆయన లంచం డిమాండ్​ చేశారు. బుధవారం మత్తుగూడలోని తాజా హోటల్​ రూ.6 వేలు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలోనూ ప్రభులాల్ లంచం తీసుకుంటూ దొరికిపోయారు.