కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ప్రమాదం.. పలువురికి తీవ్ర గాయాలు

కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో  ప్రమాదం.. పలువురికి  తీవ్ర గాయాలు

సూర్యాపేటలో గుంతకండ్ల సావిత్రమ్మ పేరుతో నిర్వహిస్తున్న 47వ జాతీయ కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగింది. గ్యాలరీ కుప్పకూలడంతో పదుల సంఖ్యలో జనానికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాద సమయంలో గ్యాలరీలో 15వందల మంది ప్రేక్షకులు ఉన్నారు. సామర్థ్యానికి మించి ప్రేక్షకులు గ్యాలరీలో కూర్చున్నారు. జాతీయ కబడ్డీ క్రీడల కోసం 3 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. గ్యాలరీ కుప్పకూలడంతో.. చాలామంది ఒకరిపై మరొకరు పడిపోయారు. తొక్కిసలాట జరిగింది. దీంతో.. చాలామంది గాయపడ్డారు. బాధితులను  హాస్పిటల్ కు తరలించారు. 29 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం నుంచి 60 జట్లు హాజరయ్యాయి. నాలుగు రోజులు జరిగే పోటీల కోసం పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో భారీ ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు,  నాలుగు వందల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.