స్క్రాప్ బిజినెస్లో లాభాలు వస్తాయంటూ టోకరా.. నమ్మించి లక్షలు ముంచిన నిందితుడు

స్క్రాప్ బిజినెస్లో లాభాలు వస్తాయంటూ టోకరా.. నమ్మించి లక్షలు ముంచిన నిందితుడు
  • నమ్మించి లక్షలు ముంచిన నిందితుడు  
  • అరెస్ట్ చేసిన పేట్ బషీరాబాద్​ పోలీసులు

జీడిమెట్ల, వెలుగు: స్క్రాప్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి మోసం చేసిన నిందితుడిని పేట్​బషీరాబాద్​ పోలీసులు అరెస్ట్ ​చేసి రిమాండ్​కి తరలించారు. జీడిమెట్ల అపురూపకాలనీకి చెందిన మేడి శిల్వ కుమార్..​శాలినీ ఎంటర్​ప్రైజెస్​పేరుతో స్క్రాప్ ​బిజినెస్ ​చేస్తున్నానని పలువురిని నమ్మించాడు. ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని చెప్పడంతో దూలపల్లికి చెందిన మిథున్​రాజ్, తాటికొండ ప్రభాకర్​రెడ్డి కలిసి రూ.53 లక్షలు ఇచ్చారు.

కొన్ని నెలల తర్వాత లాభం రాకపోవడం, అసలు అడిగినా ఇవ్వకపోవడంతో గట్టిగా ప్రశ్నించారు. దీంతో రూ. 7.72 లక్షలు చెల్లించి మిగిలిన రూ.45 లక్షలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో వారు పేట్​బషీరాబాద్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అరెస్ట్​చేసి రిమాండ్​కి తరలించారు. కాగా, ఇతడిపై సూరారం పోలీస్​ స్టేషన్​లో సైతం ఇదే విధమైన కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.