- బాధ్యతలు కేటాయించిన సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
గచ్చిబౌలి, వెలుగు : సైబరాబాద్ కమిషనరేట్లోని ఒక్కో నామినేషన్ సెంటర్కు ఒక ఏసీపీ అధికారిని నోడల్ఆఫీసర్ అండ్ ఇన్ చార్జిగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర నియమించారు. సోమవారం గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ఆఫీస్లో డీసీపీ, ఏసీపీ అధికారులతో ఆయన మీటింగ్నిర్వహించారు. నవంబర్3న అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఈ ప్రక్రియ 10వ తేదీ వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నామినేషన్సెంటర్లకు ఇన్ చార్జి అండ్నోడల్ఆఫీసర్లుగా ఏసీపీలను నియమించామని సీపీ రవీంద్ర తెలిపారు.
ప్రతి సెంటర్ వద్ద నాలుగంచెల సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. అదే విధంగా రిటర్నింగ్ ఆఫీసర్తో సమన్వయం చేసుకుంటూ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలు, మీటింగ్లకు సంబంధించిన పర్మిషన్లు ఇవ్వాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం.. నామినేషన్ ప్రక్రియలో రూల్స్ పాటించాలన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జాయింట్సీపీ అవినాష్ మహంతి, డీసీపీలు, ఏసీపీలు పాల్గొన్నారు