పర్వతగిరి/ గూడూరు, వెలుగు: ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని మామునూర్ ఏసీపీ వెంకటేశ్ తెలిపారు. వరంగల్ జిల్లా పర్వతగిరి, కల్లెడ, చింత నెక్కొండ, ఏనుగల్లు గ్రామాల్లో మంగళవారం పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ ప్రజలు ధైర్యంగా ఓటింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ప్రధాన వీధుల్లో సీఐ సూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.

