వరంగల్కలెక్టరేట్లో గ్రీవెన్స్కు అర్జీల వెల్లువ 

వరంగల్కలెక్టరేట్లో గ్రీవెన్స్కు అర్జీల వెల్లువ 

ములుగు/ జనగామ అర్బన్/గ్రేటర్​ వరంగల్/ పర్వతగిరి/ ములకలపల్లి, వెలుగు :  ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్​కు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయి. వరంగల్​కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 113 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్​ సత్య శారదాదేవి తెలిపారు. కాగా, పర్వతగిరి మండలం గోరుగుట్టతండాలో బెల్టు షాపులు నిర్వహించవద్దని, లిక్కర్​ అమ్మొద్దని సర్పంచ్​విజయలక్ష్మీభాస్కర్ ఆధ్వర్యంలో పాలకమండలి తీర్మానించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్​లో కలెక్టర్​కు పత్రాన్ని అందజేశారు.

జనగామ ప్రజావాణికి 157 వినతులు వచ్చాయని కలెక్టర్​ సందీప్​ కుమార్​ ఝా తెలిపారు. 
ములుగులో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 49 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్​ దివాకర పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐటీడీఏలో నిర్వహించిన గ్రీవెన్స్​లో కౌలు పేరుతో గిరిజన రైతు జామాయిల్​ తోటను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు ఏపీవో డేవిడ్​ రాజుకు వినతి పత్రం అందజేశారు.