ఖైరతాబాద్,వెలుగు: జాబ్ ల పేరిట నిరుద్యోగ యువతను ఆకర్షించి మనీ సర్క్యూలేషన్స్కీమ్ లో ఇరికించి ప్రాణాలను తీసే సంస్థలపై ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫైనాన్సియల్ఫ్రాడ్స్విక్టిమ్స్వెల్ఫేర్అసోసియేషన్అధ్యక్షుడు గురుప్రీత్సింగ్ఆనంద్, జాయింట్సెక్రటరీ అనూజ కొటేచ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రూల్స్ కు వ్యతిరేకంగా కొన్నిసంస్థలు ఆకర్షణీయమైన స్కీమ్ లతో యువతను ఆకట్టుకుని ప్రజల నుంచి రూ. కోట్లలో వసూలు చేయించి చివరకు మోసగిస్తున్నాయని ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్ లో ఆదివారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. అధిక వడ్డీ ఆశచూపి నమ్మకం కలిగిస్తున్నాయని, డబ్బు డిపాజిట్చేసిన వారు రిటర్న్ అడగడంతో ఎలా ఇవ్వాలో తెలియక యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ఇటీవల శంకర్ పల్లి మండలం టంగుటూర్ కు చెందిన రవి మనీ సర్క్యూలేషన్ స్కీమ్ లో చేరి ఆ సంస్థ చేసిన మోసానికి కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినది తెలిసిందేనని పేర్కొన్నారు. గతేడాది సికింద్రాబాద్లోని స్వప్నలోక్కాంప్లెక్స్లోని క్యూనెట్సంస్థలో జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఇటువంటిదేనని గుర్తుచేశారు. ఇప్పటికే ఇలాంటి సంస్థలపై కోర్టులో కేసులు ఉన్నాయని, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ఈ సమావేశంలో ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు.