విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారు

విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారు

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకరిన్నాన్నారు నటుడు మోహన్ బాబు. 2019 ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘించిన కేసులో ఏపీలోని తిరుపతి కోర్టుకు హాజరయ్యారు మోహన్ బాబు.  2019 మార్చి 22న ఫీజు రియంబర్స్ మెంట్ కోసం తిరుపతి, మదనపల్లె జాతీయ రహదారిపై మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ , విద్యానికేతన్ విద్యార్థులతో కలిసి ధర్నా చేపట్టారు. అయితే అప్పుడు ఎన్నికల కోడ్ అమలు ఉండటంతో మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ పై కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్ బాబుతో పాటు విష్ణు,మనోజ్ కూడా కోర్టుకు హాజరయ్యారు. అయితే విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు మోహన్ బాబు.