30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ప్రేక్షకులకు పరిచయమైన నటుడు పృథ్వీరాజ్. చాలా సినిమాల్లో తనదైన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్వించిన పృథ్వీ.. నటుడిగా తాను బాధపడిన కొన్ని సందర్భాలను తాజాగా ప్రేక్షకులతో పంచుకున్నారు.
కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవుళ్లు చిత్రంలో ముందుగా రాముడి పాత్రకు తనను, సీత పాత్ర కోసం లయను లక్ష్మణుడి పాత్ర కోసం మరో వ్యక్తిని తీసుకున్నారని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. మేకప్ వేసుకున్నాక అందరూ ఎన్టీఆర్లా ఉన్నారంటూ కాంప్లిమెంట్స్ ఇచ్చారని తెలిపారు. మరుసటి రోజుకు రెడీ అవుతుండగా అక్కడికి హీరో శ్రీకాంత్ రావడంతో రాముడి పాత్రను ఆయన పోషించారని పృథ్వీ వెల్లడించారు. దీంతో తాను చాలా బాధపడ్డానని అన్నారు. ఇదే సినిమాలో పృథ్వీరాజ్ వెంకటేశ్వరస్వామి పాత్రలో కనిపించి అలరించారు.
నటుడిగా పలు సినిమాల్లో నటించిన పృథ్వీరాజ్ ఇప్పుడు దర్శకుడిగా మారారు. తన కూతురు శ్రీలును హీరోయిన్ గా పరిచయం చేస్తూ.. కొత్త రంగుల ప్రపంచం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 2023 నవంబర్ 17న రిలీజ్ చేయనున్నారు.