
బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో నటుడు విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. బషీర్ బాగ్ లోని కార్యాలయంలో ఆయనను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద వారి వాంగ్మూలాలను నమోదు చేస్తున్నట్లు సమాచారం. బెట్టింగ్ యాప్ ల నుంచి తీసుకున్న పారితోషికాలు,కమిషన్ లపై అరా తియ్యనుంది ఈడీ.. చట్టవిరుద్ధమైన యాప్ లకు ప్రమోషన్ ఎందుకు చెయ్యాల్సి వచ్చింది..? అనే కోణంలో ఈడీ విచారించనుంది.
బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్చేసిన సెలబ్రిటీలకు జులై 21న ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్ జులై 30న విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్ లనుంచి పైసా తీసుకోలేదని తెలిపారు. మళ్లీ బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేయబోనని చెప్పారు.
ఈ కేసులో ఆగస్టు 11న రానా... 13న మంచు లక్ష్మి విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. వీరు జంగ్లీ రమ్మీ, లోటస్ 365, జీత్విన్ వంటి ఆన్ లైన్ బెట్టింగ్ యాప్లను ప్రయోట్ చేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ ప్లాట్ ఫామ్ లు అక్రమ బెట్టింగ్ లు, జూదం ద్వారా కోట్లాది రూపాయల నిధులను ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయి.
పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ను ఈడీ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చారు. ఈ క్రమంలోనే విచారణ జరుపుతున్నారు.