నా దారులన్నీ మూసుకుపోయాయి.. నువ్వు నేను హీరోయిన్ అనిత ఎమోషనల్ పోస్ట్

నా దారులన్నీ మూసుకుపోయాయి.. నువ్వు నేను హీరోయిన్ అనిత ఎమోషనల్ పోస్ట్

టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ నువ్వు నేను(Nuvvu nenu) సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ప్రచయమైన బ్యూటీ అనిత(Anitha). దర్శకుడు తేజ(Teja) తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైనర్ భారీ విజయాన్ని సాధించింది. ఈ విజయంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది ఈ బ్యూటీ... అయితే ఆ ఫేమ్ ను సరిగా ఉపయోగించుకోలేకపోయింది అనిత. 

ఆ తరువాత కేసుల టాలీవుడ్ లో వరుస సినిమాలు చేసింది కానీ.. అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. ఆ సమయంలోనే బాలీవుడ్ నుండి అవకాశాలు రావడంతో ముంబైకి మకాం మార్చింది. అక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో.. పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. ఆతరువాత హిందీ సీరియల్స్ లో కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది అనిత. 

ఇదిలా ఉండగా తాజాగా  అనిత తన ఇన్ స్టాగ్రామ్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ రోజు నేను చేస్తున్న ఈ పోస్ట్ నా జీవిత ప్రయాణానికి గుర్తు. ఆ టీనేజ్ డేస్ ఇంకా గుర్తున్నాయి. సాధారణ మధ్య తరగతి అమ్మాయిగా నా కలలను డైరీలో రాసి పెట్టుకున్నాను కానీ.. అప్పుడే నా జీవితంలో ఓ విషాదం సంఘటన చోటుచేసుకుంది. నా హీరోని, నా తండ్రిని కోల్పోయాను. ఆ సమయంలో నా చుట్టూ దారులన్నీ మూసుకుపోయాయి కానీ.. నేను వాటికి ఎప్పుడు భయపడలేదు. వాటన్నిటినీ అధిగమించి నా కుటుంబం కోసం నిలబడ్డాను. ఈ స్థాయిలో ఉన్నాను.. అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు అనిత. అంతేకాదు.. ప్రస్తుతం వివాహ జీవితంలో ఆనందంగా ఉన్నానని, నా కుటుంబం, నా పిల్లలే నా ప్రపంచం అని చెప్పుకొచ్చారు అనిత. అలా తన తండ్రిని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యింది అనిత. ప్రస్తుతం అనిత చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.