రామ్ చరణ్కు సరసన కృతి సనన్‌‌‌‌‌‌‌‌!

రామ్ చరణ్కు సరసన కృతి సనన్‌‌‌‌‌‌‌‌!

పదేళ్ల క్రితం మహేష్ బాబు సినిమా ‘వన్ నేనొక్కడినే’తో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పరిచయం అయిన కృతి సనన్‌‌‌‌‌‌‌‌... ప్రస్తుతం బాలీవుడ్‌‌‌‌‌‌‌‌లో మోస్ట్‌‌‌‌‌‌‌‌ వాంటెడ్‌‌‌‌‌‌‌‌ హీరోయిన్. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌తో దూసుకెళ్తున్న కృతి.. తాజాగా ఓ టాలీవుడ్‌‌‌‌‌‌‌‌ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇందులో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా జాన్వీ కపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇందులోనే మరో హీరోయిన్‌‌‌‌‌‌‌‌కు ఛాన్స్ ఉందట. ప్లాష్ బ్యాక్‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌లో వచ్చే ఆ పాత్ర కోసం కృతి సనన్‌‌‌‌‌‌‌‌ను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆమె తెలుగులో నటించిన తొలిచిత్రం ‘వన్ నేనొక్కడినే’, ఆ తర్వాత చేసిన ‘దోచెయ్‌‌‌‌‌‌‌‌’తో పాటు ఇటీవల ప్రభాస్‌‌‌‌‌‌‌‌కు జంటగా నటించిన ‘ఆదిపురుష్‌‌‌‌‌‌‌‌’ చిత్రాలు నిరాశ పరిచాయి.