పదేళ్ల క్రితం మహేష్ బాబు సినిమా ‘వన్ నేనొక్కడినే’తో హీరోయిన్గా పరిచయం అయిన కృతి సనన్... ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. వరుస క్రేజీ ప్రాజెక్ట్స్తో దూసుకెళ్తున్న కృతి.. తాజాగా ఓ టాలీవుడ్ సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ను ఇటీవలే అనౌన్స్ చేశారు. ఇందులోనే మరో హీరోయిన్కు ఛాన్స్ ఉందట. ప్లాష్ బ్యాక్ సీన్స్లో వచ్చే ఆ పాత్ర కోసం కృతి సనన్ను సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఆమె తెలుగులో నటించిన తొలిచిత్రం ‘వన్ నేనొక్కడినే’, ఆ తర్వాత చేసిన ‘దోచెయ్’తో పాటు ఇటీవల ప్రభాస్కు జంటగా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రాలు నిరాశ పరిచాయి.