హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ను నిర్వహించే సీఎంఆర్ హైదరాబాద్లోని ఉప్పల్లో మరో మాల్ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్లు బండారి లక్ష్మారెడ్డి, జక్కా వెంకటరెడ్డి తదితరులు, నటి కృతి శెట్టి పాల్గొన్నారు. మంత్రి తలసాని మాట్లాడుతూ ఉప్పల్లో సీఎంఆర్ వంటి పెద్ద గ్రూప్ తన మాల్ను ఓపెన్ చేయడం సంతోషమన్నారు.
సీఎంఆర్ ఫౌండర్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ అన్ని రకాల వేడుకలకు అనువైన వస్త్రాలు ఇక్కడ లభిస్తాయని చెప్పారు. లేటెస్ట్ మోడల్స్ను తక్కువ ధరలకే అమ్ముతున్నామని చెప్పారు. సీఎంఆర్ ఎండీ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ ఇది తమకు 25వ షోరూమ్ అని చెప్పారు. ఈ సందర్భంగా కృతిశెట్టి మాల్ అంతా సందడి చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.