
హైదరాబాద్, వెలుగు: పరువు నష్టం కేసులో నటి మంచు లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై నమోదైన కేసు విచారణను 4 వారాలు నిలిపి వేస్తూ కోర్ట్మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. ఒక టీవీ చర్చావేదిక కార్యక్రమానికి సంబంధించి జర్నలిస్ట్ సాంబశివరావు ఫిర్యాదుతో మంచు లక్ష్మిపై 2018లో కేసు నమోదైంది. హైదరాబాద్ 14వ ఎసీఎంఎం కోర్టులో విచారణలో ఉంది. దీనిని కొట్టేయాలని, కేసు నమోదుకు ప్రాథమిక ఆధారాలు లేవని పిటిషనర్ న్యాయవాది వాదించారు.