Saranya pradeep: ఆ సీన్ గురించి మాట్లాడినప్పుడు చాలా బాధేసింది

Saranya pradeep: ఆ సీన్ గురించి మాట్లాడినప్పుడు చాలా బాధేసింది

శరణ్య ప్రదీప్(Saranya Pradeep).. టాలీవుడ్ లో ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నటి. ప్రముఖ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన శరణ్య.. నటిగా మారి ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు. ఫిదా(Fida) సినిమాలో హీరో వరుణ్ తేజ్(Varun Tej) కు వదినగా నటించి కెరీర్ లో మొదటి బ్రేక్ అందుకున్నారు. ఆ సినిమా తరువాత కూడా చాలా సినిమాల్లో నటించారు శరణ్య కానీ, ఇటీవల విడుదలైన అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్(Ambajipeta Marriage Band) సినిమాలో ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమాలో ఆమె నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.

నటుడు సుహాస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు శరణ్య. ఈ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. సినిమాలోని ఒక ప్రత్యేకమైన సన్నివేశం గురించి ఎవరికీ వారు ఇష్టం వచ్చినట్లు మాటాడినప్పుడు చాలా బాధేసింది అంటూ చెప్పుకొచ్చారు. ఇంతకీ ఆ సీన్ ఏంటంటే.. సినిమాలో ఒక సీన్ లో శరణ్య ఒంటిపై బట్టలు లేకుండా కనిపిస్తారు. నిజానికి ఆ సీన్ అంత అసభ్యకరంగా ఉండదు. కానీ, ఆ సీన్ గురించి కొన్ని యూట్యూబ్ చానల్స్ కావాలని లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి థంబ్ నెయిల్స్ పెట్టారని. ఆ సన్నివేశం గురించి మాట్లాడినప్పుడు చాలా బాధేసింది అని చెప్పుకొచ్చారు శరణ్య. 

నిజానికి ఆ సీన్ చేయడానికి తన భర్త చాలా ప్రోత్త్సహించారట. సినిమాలో పాత్ర చాలా బాగుందని, ఆలాంటి పాత్ర దొరకడం చాలా అరుదని, సన్నివేశంలో కూడా ఎలాంటి అసభ్యత లేదు కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ఆయన చెప్పారని, ఆ ధైర్యంతోనే సినిమా చేశానని చెప్పుకొచ్చారు శరణ్య. ప్రస్తుతం ఆమె  చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి.