కాన్పూర్: అదానీ గ్రూప్ సోమవారం మందుగుండు సామగ్రి, క్షిపణుల తయారీ కోసం రెండు మెగా ఫ్యాక్టరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది.- ఇది దక్షిణాసియాలో అతిపెద్దది అని వెల్లడించింది. అదానీ డిఫెన్స్ వై ఏరోస్పేస్ను 500 ఎకరాల్లో నిర్మించారు.
వీటి నిర్మాణం కోసం రూ. 3,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. ఇది సాయుధ దళాలు, పారామిలిటరీ బలగాలు పోలీసుల కోసం అధిక -నాణ్యత కలిగిన చిన్న, మధ్యస్థ, పెద్ద-స్థాయి మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది. వీటిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే సెంట్రల్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ప్రారంభించారు.