ఉత్తరప్రదేశ్​లో అదానీ మిస్సైల్​ కాంప్లెక్స్​

ఉత్తరప్రదేశ్​లో అదానీ మిస్సైల్​ కాంప్లెక్స్​

కాన్పూర్: అదానీ గ్రూప్ సోమవారం మందుగుండు సామగ్రి,  క్షిపణుల తయారీ కోసం రెండు మెగా ఫ్యాక్టరీలను ప్రారంభించినట్లు ప్రకటించింది.- ఇది దక్షిణాసియాలో అతిపెద్దది అని వెల్లడించింది.  అదానీ డిఫెన్స్ వై ఏరోస్పేస్​ను 500 ఎకరాల్లో నిర్మించారు. 

వీటి నిర్మాణం కోసం రూ. 3,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టారు. ఇది సాయుధ దళాలు, పారామిలిటరీ బలగాలు  పోలీసుల కోసం అధిక -నాణ్యత కలిగిన చిన్న, మధ్యస్థ,  పెద్ద-స్థాయి మందుగుండు సామగ్రిని తయారు చేస్తుంది.   వీటిని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ మనోజ్ పాండే  సెంట్రల్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్. రాజా సుబ్రమణి ప్రారంభించారు.