5 ఏళ్లలో అదానీ గ్రూప్ పెట్టుబడులు రూ.1.72 లక్షల కోట్లు

5 ఏళ్లలో అదానీ గ్రూప్ పెట్టుబడులు రూ.1.72 లక్షల కోట్లు
  • ప్రకటించిన గౌతమ్ అదానీ

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ రానున్న ఐదేళ్లలో  15–-20 బిలియన్ డాలర్లు (రూ.1.72 లక్షల కోట్లు) ఇన్వెస్ట్ చేస్తుందని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు.  కంపెనీ బ్యాలెన్స్ షీట్ స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ఉందని, బిజినెస్ గ్రోత్ కూడా బాగుందని ఆయన అన్నారు. “సవాళ్లు, స్క్రూటినీ వచ్చినా మేం ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. స్ట్రాటజీని మార్చుకుని, మరింత  స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా ముందుకెళ్లాం” అని అదానీ గ్రూప్ ఫ్లాగ్‌‌‌‌‌‌‌‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ లేటెస్ట్ యాన్యువల్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో  పేర్కొన్నారు.   “మా బలం మా షేర్‌‌‌‌‌‌‌‌హోల్డర్స్ మాపై ఉంచిన నమ్మకం నుంచి వస్తుంది. మా గోల్స్ ఇండియా గోల్స్‌‌‌‌‌‌‌‌తో లింకై ఉన్నాయి” అని  చెప్పారు. యూఎస్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ ఎస్‌‌‌‌‌‌‌‌ఈసీ నుంచి అదానీ గ్రీన్ ఎనర్జీపై వచ్చిన ఆరోపణలపై మాట్లాడుతూ, ‘‘ఇలాంటి టెస్ట్‌‌‌‌‌‌‌‌లు ఇదే మొదటిసారి కాదు, చివరిసారీ కాదు. 

ప్రతి సవాలు మమ్మల్ని మరింత స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌గా మార్చాయి”అని అన్నారు.   అదానీ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో ఎవరూ ఫారిన్ కరెప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌సీపీఏ) ఉల్లంఘించినట్టు లేదా జస్టిస్‌‌‌‌‌‌‌‌ను అడ్డుకునేందుకు కుట్ర చేసినట్టు ఛార్జ్ ఎదుర్కోలేదని  అదానీ వివరించారు. పోర్ట్స్, ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్, రెన్యూవబుల్ ఎనర్జీ, డేటా సెంటర్స్, డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, సిటీ గ్యాస్ వంటి బిజినెస్‌‌‌‌‌‌‌‌లలో అదానీ గ్రూప్ ఉంది.