
న్యూఢిల్లీ: మన దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ యుటిలిటీ అయిన అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఏపీఎస్ఈజెడ్) దేశీయ బాండ్ ఇష్యూ ద్వారా రూ. 5,000 కోట్లు సమీకరించినట్లు శుక్రవారం తెలిపింది. ఎల్ఐసీ నుంచి 15 సంవత్సరాల నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ (ఎన్సీడీ) ద్వారా నిధులను సమీకరించింది. ఈ ఎన్సీడీలకు 7.75 శాతం వార్షిక కూపన్ రేటు ఉంటుంది. ఈ బాండ్లకు ఏఏఏ/స్టేబుల్ డొమెస్టిక్ క్రెడిట్రేటింగ్ఉందని కంపెనీ పేర్కొంది. డిబెంచర్లు బీఎస్ఈలో లిస్ట్ అవుతాయి. ఏపీఎస్ఈజెడ్ 2030 ఆర్థిక సంవత్సరానికి బిలియన్ టన్నుల కార్గోను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 2025 ఆర్థిక సంవత్సరంలో ఉన్నదాని కంటే 2 రెట్లు ఎక్కువ.