కామారెడ్డి టౌన్, వెలుగు: నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ జితేశ్వీ పాటిల్ అధికారులకు సూచించారు. బుధవారం కామారెడ్డి ఆర్డీవో ఆఫీస్లో నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను అడిషనల్కలెక్టర్ చంద్రమోహన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... నామినేషన్ పత్రాలు, అఫిడవిట్లను నింపడంలో అభ్యర్థులకు సహకరించాలన్నారు. అభ్యర్థి గదిలోకి ఎంట్రీ కాగానే కనిపించేలా డిజిటల్గడియారం, సీసీ కెమెరా ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు తమ వెహికిల్స్ను నామినేషన్సెంటర్కు వంద మీటర్ల దూరంలో పార్కింగ్ చేసుకునేలా బారీకేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. రిటర్నింగ్ఆఫీసర్శ్రీనివాస్రెడ్డి, తహసీల్దార్ లత తదితరులు ఉన్నారు.
