సోషల్ మీడియాపై టెక్​ టీమ్​కు అవగాహన

సోషల్ మీడియాపై టెక్​ టీమ్​కు అవగాహన

సిద్దిపేట రూరల్, వెలుగు : ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మంచి పనులను టెక్ టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ సూచించారు. బుధవారం సీపీ ఆఫీస్ లో టెక్ టీమ్ కు సోషల్ మీడియాపై ఒక రోజు వర్క్ షాప్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసేటప్పుడు  కచ్చితమైన సమాచారం ఉండేలా చూడాలన్నారు.  ఎస్బీ ఇన్స్​పెక్టర్ రఘుపతి రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిబ్బందికి అవగాహన కల్పించారు. ఈ వర్క్ షాప్ లో సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి, గజ్వేల్ ట్రాఫిక్ సీఐ తిరుపతి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అశోక్, వేణు తదితరులు పాల్గొన్నారు.