రెండో వెహికల్పై అదనపు లైఫ్ ట్యాక్స్ ఎత్తివేత.. మార్చి 23 నుంచి అమల్లోకి

రెండో వెహికల్పై అదనపు లైఫ్ ట్యాక్స్ ఎత్తివేత.. మార్చి 23 నుంచి అమల్లోకి
  • అదే రోజున ‘వాహన్’  పోర్టల్ ప్రారంభం
  • నేషనల్​ డేటాబేస్‌‌‌‌ లోకి తెలంగాణ వెహికల్స్ 
  • దీని ద్వారా వాహనదారులకు అనేక ప్రయోజనాలు
  • ఇప్పటివరకు రెండో వెహికల్ పై అదనంగా 2 శాతం లైఫ్ ట్యాక్స్

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో ఇక నుంచి రెండో వెహికల్ కొనేవారిపై అదనపు లైఫ్ ట్యాక్స్‌‌‌‌ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఈ నెల 23 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు వాహనదారు తన పేరు మీద ఒక వెహికల్ కలిగి ఉండి, అదే పేరుపై రెండో వాహనం కొనుగోలు చేస్తే.. 2 శాతం అదనంగా లైఫ్ ట్యాక్స్ ను ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తోంది. ఇకపై ఆ అదనపు భారం ఉండదు. ఇది రాష్ట్రంలోని లక్షలాది టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు ఊరటనిచ్చే విషయం. 

ట్రాఫిక్, కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా కొత్త వాహన కొనుగోళ్లను కంట్రోల్​చేసేందుకు ఉమ్మడి ఏపీలో అప్పటి ప్రభుత్వం అడిషనల్​ ట్యాక్స్ అమల్లోకి తెచ్చింది.  కాగా, ప్రస్తుతం రెండో వాహనంగా జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. 

కేంద్ర వాహన పోర్టల్​లోకి.. 

రాష్ట్రంలో రెండో వెహికల్ కొనేవారిపై అదనపు లైఫ్ ట్యాక్స్‌‌‌‌ ఎత్తివేసే సోమవారం నుంచే తెలంగాణ రవాణా శాఖ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘వాహన్’ పోర్టల్ లోకి చేరనుంది. ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నిర్ణయం వల్ల నేషనల్​వెహికల్​డేటా బేస్ లోకి తెలంగాణ వెహికల్స్ చేరనున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర రవాణా శాఖ తన సొంత పోర్టల్ ద్వారానే ఆన్ లైన్ సేవలు అందిస్తోంది. దీని ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని రవాణా శాఖ అధికారులు చెప్తున్నారు.

‘వాహన్’ పోర్టల్​లో చేరితే కలిగే ప్రయోజనాలివే..

నేషనల్​ డేటాబేస్‌‌‌‌తో అనుసంధానం: రాష్ట్రానికి చెందిన వాహనాల వివరాలన్నీ  నేషనల్​ సర్వర్‌‌‌‌తో అనుసంధానం కావడం వల్ల ఇతర రాష్ట్రాల్లో వాహన తనిఖీలు జరిగినప్పుడు లేదా వాహనాలను ఇతర రాష్ట్రాలకు విక్రయించినప్పుడు డాక్యుమెంటేషన్ ప్రక్రియ ఈజీ అవుతుంది.
మోసాలకు అడ్డుకట్ట: సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనేవారు ఆ వాహనానికి సంబంధించిన పూర్తి చరిత్ర, పెండింగ్ చలానాలు, యాజమాన్య వివరాలను ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే తనిఖీ చేయవచ్చు. దీని ద్వారా వాహన కొనుగోలులో జరిగే మోసాలకు అడ్డుకట్ట పడ్తుంది. ముఖ్యంగా దొంగవాహనాల అమ్మకాలు, కొనుగోళ్లకు చెక్​పడుతుంది.

సేవల్లో  వేగం: డిజిటల్ విధానం వల్ల రవాణా శాఖ కార్యకలాపాల్లో పారదర్శకత పెరుగుతుంది. బ్రోకర్స్​ప్రమేయం తగ్గుతుంది.  మరింత వేగంగా రవాణా సేవలు అందుతాయి. 
ఆన్‌‌‌‌లైన్ సేవలు: ఆర్సీ డూప్లికేట్ కాపీ, పేరు మార్పు, చిరునామా మార్పు, లోన్​ తొలగింపు లాంటి సేవలను నేరుగా ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోనే పూర్తి చేసుకోవచ్చు. దీనివల్ల ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది.
ఎం-పరివాహన్ యాప్: వాహన్ పోర్టల్ ద్వారా వాహనదారులు తమ వాహన వివరాలను స్మార్ట్‌‌‌‌ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా తెలుసుకోవచ్చు, డిజిటల్ డాక్యుమెంట్లను ఈ యాప్​లో భద్రపరుచుకోవచ్చు.