ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాకు యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీని ఏర్పాటు చేయాలని, కుప్టీ ప్రాజెక్ట్ నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డిని జిల్లా డీసీసీ ప్రెసిడెంట్నరేశ్జాదవ్కోరారు. హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం సీఎంను కలిసిన నరేశ్జాదవ్వినతిపత్రం అందజేశారు.
ఇటీవల జిల్లాలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు సంబంధించి జిల్లా తరఫున చేసిన తీర్మానాన్ని ముఖ్యమంత్రికి సమర్పించారు. సానుకూలంగా స్పందించిన సీఎం అభివృద్ధిపై హామీ ఇచ్చినట్లు నరేశ్జాదవ్తెలిపారు.
