- 5, 10, 30 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహణకు అటవీ శాఖ ఏర్పాట్లు
మంచిర్యాల, వెలుగు: ఎకో టూరిజం అభివృద్ధి, ఫిట్నెస్పై అవగాహన లక్ష్యంగా మంచిర్యాల అటవీశాఖ ఆధ్వర్యంలో అక్టోబర్11న నేషనల్లెవల్మారథాన్ నిర్వహించనున్నారు. హైదరాబాద్కు చెందిన 'గ్రీన్సెక్యూర్ ఫౌండేషన్' సహకారంతో మంచిర్యాల శివారు ర్యాలీ ఫారెస్టులోని జంగిల్ సఫారీ ట్రాక్ పై నిర్వహించనున్నట్టు డీఎఫ్వో రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. జిల్లా అటవీశాఖ మొదటిసారి నిర్వహిస్తున్న ఆల్ర్టా మారథాన్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టు గురువారం మీడియాకు వెల్లడించారు.
మారథాన్ నిర్వహణ కోసం గడ్పూర్ సమీప అటవీ ప్రాంతంలో మూడు ప్రత్యేక ట్రాక్లను సిద్ధం చేశామని.. 5, 10, 30 కిలోమీటర్ల విభాగాల్లో మారథాన్జరుగుతుందన్నారు. పాల్గొనే వారికి గైడ్ చేయడానికి, అత్యవసర వైద్య సహాయం కోసం ట్రాక్ పొడవునా అటవీ సిబ్బందిని నియమిస్తామన్నారు. మారథాన్లో పాల్గొన్న వారి పేరిట మరుసటి రోజు బొక్కలగుట్ట గాంధారి వనం (అర్బన్ పార్క్)లో మొక్కలు నాటుతామని పేర్కొన్నారు. ఔత్సాహికులు www.gtrultra.com వెబ్సైట్ లోనిర్ణీత ఎంట్రీ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని కోరారు. బ్రేక్ఫాస్ట్, టీ-షర్ట్, మెడల్, ప్రశంసాపత్రం అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 8639337951 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
