ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో టీ సిరీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 16న విడుదల కానుంది. రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు. శ్రీ రామ నవమి నుండి ఈ మూవీ ప్రమోషన్స్ను ప్రారంభించబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్, నిర్మాత భూషణ్ కుమార్.. జమ్మూ కాశ్మీర్లోని వైష్ణో దేవి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఈనెల 30 నుండి ప్రమోషన్స్ను స్టార్ట్ చేయబోతున్నట్టు ఈ సందర్భంగా ప్రకటించారు. రిలీజ్కు మూడు నెలల ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న టీమ్, దేశవ్యాప్తంగా రకరకాల ఈవెంట్స్తో సినిమాను ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు సాలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలతో పాటు మారుతి డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్.