ఇస్రో మరో ముందడుగు: జనవరి 6న ఆదిత్య L1 గమ్యస్థానం చేరుతుంది

ఇస్రో మరో ముందడుగు:  జనవరి 6న ఆదిత్య L1 గమ్యస్థానం చేరుతుంది

సూర్యునిపై అధ్యయనానికి ప్రయోగించిన ఆదిత్య L1గమ్యస్థానానికి అత్యంత చేరువలో ఉందని ఇస్రో శాస్త్రవేత్తులు వెల్లడించారు. 2024 జనవరి 6న అంటే ఎల్లుండి సాయంత్రం 4 గంటలకు తన గమ్యస్థానం లెగ్రాంజ్ పాయింట్ 1 ను చేరుకుటుందని ఇస్రో చైర్మన్ సోమ్ నాథ్ తెలిపారు.

2023 సెప్టెంబర్ 23  న  ఆదిత్య L1 ను PSLV-C57 రాకెట్ లో సూర్యుడి అధ్యయనానికి ఇస్రో ప్రయోగించింది. సూర్యుడి బయటి పొర అయిన కరోనాతో సహ పరిసర ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగించబడింది. సుదీర్ఘ 1.5 కిలోమీటర్ల సుదర్ఘ ప్రయాణం తర్వాత గమ్యస్థానం అయిన లెగ్రాంజ్ పాయింట్ 1 ను జనవరి 6 సాయంత్రి ఆదిత్య L1  చేరుకోనుంది. 

లాగ్రాంజ్ పాయింట్ వద్ద ఆదిత్య ఎల్ 1 ఉంచిబడినప్పుడు అది భూమికి, సూర్యుడికి మధ్య దూరంలో ఒక శాతం అంటే 1.5 మిలియన్ కిలోమీటర్ల వద్ద ఉండి అధ్యయనం కొనసాగుతంది. ఫొటోస్పియర్, క్రోమోస్పియర్, కరోనాతో సహా సూర్యుని  బయటి పొరల  లోతైన అధ్యయనం చేయనుంది.

భూమికి, సూర్యుడికి మధ్య గురుత్వాకర్షణ సమతుల్యం ఉన్న ప్రాంతం లాగ్రాంజ్ పాయింట్ 1 నిరంతర అధ్యయనం కోసం స్థిరమైన స్థానాన్ని అందిస్తుంది. ఆదిత్య ఎల్ 1 5.2 సంవత్సరాల పాటు లాగ్రాంజ్ పాయింట్ వద్ద సూర్యిని అధ్యయనం చేస్తుంది. తర్వాత దీనికి పొడిగించే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.