కొమురంభీం వారసులైన ఆదివాసులు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధం కావాలని అదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పిలుపునిచ్చారు. పోడు భూములకు పట్టాలివ్వకపోతే ఆదివాసీల తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో ఆదివాసీ గిరిజనులను కించపరిచే విధంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. సీఎం బేషరతుగా క్షమాపణలు చెప్పి ఆర్హులైన ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆదివాసులపై కేసీఆర్ కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. పోడు భూములకు పట్టాలిస్తామని సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. అటవీ భూములు ఆక్రమించుకుంటున్నారని ఆదివాసులపై నిందలు మోపడం కరెక్ట్ కాదన్నారు. కేసీఆర్ మరో నిజాం రజాకార్లా వ్యవహరిస్తూ అడవి బిడ్డలైన ఆదివాసులపై విషం గక్కుతున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగం పట్ల కేసీఆర్ కు కనీస అవగాహన లేకపోవడం శోచనీయమన్నారు. 5,6 షెడ్యూల్ పై కేసీఆర్ కు అవగాహన లేదని.. 5, 6 షెడ్యూల్ ప్రకారం అడవిపై పూర్తి అధికారాలు ఆదివాసులకే ఉంటాయన్నారు. అదివాసులపై అటవీ, పోలీసు అధికారుల అణచివేతను ఇక సహించబోమని బాపూరావు స్పష్టం చేశారు.
ఆదివాసీలు బీఆర్ఎస్ సర్కార్పై పోరుకు సిద్ధం కావాలె : ఎంపీ బాపూరావు
- తెలంగాణం
- February 10, 2023
లేటెస్ట్
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
- వాలంటీర్లకు హైకోర్టులో ఊరట.. జోక్యం చేసుకోలేమన్న ఈసీ..
- IPL 2024: వార్నర్ దారిలోనే కమ్మిన్స్.. తెలుగు డైలాగ్స్తో అదరగొట్టాడుగా
- హామీలను అమలు చేయకుంటే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం: శ్రీధర్ బాబు
- కేసీఆర్ కు మతి భ్రమించింది..రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తడో తెల్వదు : బండి సంజయ్
- బీజేపీ చేతిలో కేసీఆర్ ఓడిపోలేదా : కిషన్ రెడ్డి
- దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే.. రాహుల్ గాంధీ ప్రధాని కావాలి: మంత్రి సీతక్క
- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం అయితడు .. ఆ అర్హత ఆయనకుంది : ఉత్తమ్కుమార్రెడ్డి
- Family Star OTT: మరో రెండు రోజుల్లో ఓటీటీలోకి ఫ్యామిలీ స్టార్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- T20 World Cup 2024: జూన్ 9న ఇండియా vs పాక్ మ్యాచ్.. పూర్తికాని స్టేడియం నిర్మాణం
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు
- పవన్ కల్యాణ్ ఆస్తులు..రూ.114.76 కోట్లు..అప్పులు రూ.64 కోట్లు