కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలుపును ఎవరూ ఆపలేరు : జాటోతు రాంచంద్రునాయక్‌‌‌‌‌‌‌‌

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలుపును ఎవరూ ఆపలేరు : జాటోతు రాంచంద్రునాయక్‌‌‌‌‌‌‌‌

నర్సింహులపేట, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గెలుపును ఆపడం ఎవరి తరం కాదని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ డోర్నకల్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి జాటోతు రాంచంద్రునాయక్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఆదివారం ఖమ్మంలో జరిగిన జనగర్జన మీటింగ్‌‌‌‌‌‌‌‌కు కార్యకర్తలతో కలిసి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ మీటింగ్‌‌‌‌‌‌‌‌కు పోతే పథకాలు రావని ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజలను భయపెడితే ఎన్నికల్లో గెలవరని, ప్రజల మనసులు గెలవాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జినుకల రమేశ్‌‌‌‌‌‌‌‌, లీడర్లు వెన్నం రవీందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రజినీకాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రామకృష్ణ, రాజశేఖర్‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

ఖమ్మంకు వెళ్లిన మానుకోట లీడర్లు

మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ అర్బన్‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఖమ్మంలో జరిగిన జనగర్జన సభకు మహబూబాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ లీడర్లు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఖమ్మం వెళ్లిన వారిలో బలరాంనాయక్, భరత్‌‌‌‌‌‌‌‌చంద్‌‌‌‌‌‌‌‌రెడ్డి, మురళీనాయక్, బెల్లయ్యనాయక్‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.