హైదరాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ఎమ్మెల్యే కిషోర్ అనుచరుల దాడిలో గాయపడిన అడ్వొకేట్ యుగేందర్ను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యుగేందర్ను దాడికి సంబంధించిన వివరాలను రేవంత్ అడిగి తెలుసుకు న్నారు. ఇంకోసారి విమర్శలు చేస్తే చంపేస్తామంటూ ఎమ్మెల్యే కిషోర్ అనుచరులు తనపై దాడి చేశారని యుగేందర్ వివరించారు. ‘‘మీరు (యుగేందర్) భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు, మీ పోరాటా నికి అండగా ఉంటది” అని రేవంత్ హామీ ఇచ్చారు. అలాగే పీసీసీ వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా యుగేందర్ను పరామర్శించారు. సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. దాడి ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండ డంతో బీఆర్ఎస్ నేతలు తమ అనుచరులతో దాడులు చేయించి భయపెడుతున్నారని అన్నారు. కార్యకర్తలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, పార్టీ అందరికీ అండగా ఉంటుందని పేర్కొన్నారు.