రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ ఏఈఈ​

రూ.5 వేలు లంచం తీసుకుంటూ..  ఏసీబీకి పట్టుబడ్డ ఏఈఈ​

ఏసీబీ అధికారుల సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహబూబాబాద్​ జిల్లాలో ఏసీబీ అధికారుల తనిఖీలు లంచం తీసుకుంటుండగా రెడ్​ హ్యండెడ్ గా పట్టుకున్నాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్​శాఖ భవనంలో జులై 4న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.  

రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ దొడ్డ లలిత ఈ దాడుల్లో  పట్టుబడ్డారు. అనంతరం వరంగల్​ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల తనిఖీలు ఎక్కువయ్యాయి. దీంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు.