![రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి పట్టుబడ్డ ఏఈఈ](https://static.v6velugu.com/uploads/2023/07/AEE-was-caught-by-ACB-while-taking-a-bribe-of-Rs.5-thousand-in-mahaboobabad_68mYR9KT0P.jpg)
ఏసీబీ అధికారుల సోదాలు సంచలనం సృష్టిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారుల తనిఖీలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పంచాయతీ రాజ్శాఖ భవనంలో జులై 4న ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు.
రూ.5 వేలు లంచం తీసుకుంటూ.. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ దొడ్డ లలిత ఈ దాడుల్లో పట్టుబడ్డారు. అనంతరం వరంగల్ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల తనిఖీలు ఎక్కువయ్యాయి. దీంతో అక్రమార్కులు ఆందోళన చెందుతున్నారు.