Defence Stock: రెండు నెలల్లో 95% పెరిగిన డిఫెన్స్ స్టాక్.. కీలక పరిణామం గురించి తెలుసా..?

Defence Stock: రెండు నెలల్లో 95% పెరిగిన డిఫెన్స్ స్టాక్.. కీలక పరిణామం గురించి తెలుసా..?

Paras Defence Stock: ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో డిఫెన్స్ స్టాక్ హంటింగ్ కొనసాగుతోంది. చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి బడ్జెట్లకు అనుకూలమైన డిఫెన్స్ షేర్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అనేక రక్షణ రంగ స్టాక్స్ స్వల్ప కాలంలోనే 100 శాతం వరకు పెరుగుదలను చూశాయి. పైగా అనేక కంపెనీలకు ఇటీవల దేశవిదేశాల నుంచి వస్తున్న కొత్త ఆర్డర్ల వెల్లువ ఇన్వెస్టర్లను ఈ రంగంలోని కంపెనీలపై ఓ కన్నేసి ఉంచేలా చేస్తున్నాయి. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పరాస్ డిఫెన్స్ కంపెనీ షేర్ల గురించే. ఈ కంపెనీ షేర్ల ధర ఒక్కోటి మార్చి 3న దాదాపు రూ.835 వద్ద ఉండగా.. కేవలం రెండు నెలల కాలంలో ఈ డిఫెస్స్ స్టాక్ షేర్లు 95 శాతం ర్యాలీతో రూ.1637 స్థాయికి చేరుకున్నాయి. అలాగే గడచిన ఆరు నెలల కాలంలో షేర్ 44 శాతం వరకు రాబడిని అందించింది. అలాగే ఐదేళ్ల కాలంలో కంపెనీ షేర్లు ఏకంగా 230 శాతం మెగా రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. 

ప్రస్తుతం పరాస్ స్టాక్ ఫోకస్ లో కొనసాగటానికి ఒక కారణం ఉంది. అదేంటంటే కంపెనీ యాజమాన్యం షేర్లను స్ప్లిట్ చేసేందుకు ప్లాన్ చేయటమే. సమీప భవిష్యత్తులో కంపెనీ షేర్లు రెండుగా విభజించబడనున్నాయని తెలుస్తోంది. ఇది కంపెనీ షేర్లలో లిక్విడిటీని పెంచటంతో పాటు ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు అందుబాటు స్థాయిల్లోకి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కంపెనీ తన షేర్లను ఇలా విభజించటం ఇదే తొలిసారి కావటం గమనార్హం. 

ఫలితాల విషయానికి వస్తే పరాగ్ డిఫెన్స్ మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో నికర లాభం రూ.19.7 కోట్లుగా నమోదైంది. ఇది ఏడాది ప్రాతిపదికన 97 శాతం పెరుగుదల.