జీవో 46 రద్దుకు ఆందోళన..   కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన

జీవో 46 రద్దుకు ఆందోళన..   కానిస్టేబుల్ అభ్యర్థుల నిరసన

ఎల్ బీనగర్,వెలుగు: ఎస్ ఐ, కానిస్టేబుల్‌ నియామకాల్లో తీసుకొచ్చిన జీవో నెం.46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కొత్తపేటలో అభ్యర్థులు ఆందోళన చేశారు. పాత పద్ధతిలోనే నియామకాలు చేపట్టాలని కోరారు. జీఓ నం.46 ప్రకారం ఉమ్మడి హైదరాబాద్ జిల్లాకు 53% రిజర్వేషన్లు కల్పించి మిగతా జిల్లాలకు 47% కేటాయిస్తున్నారన్నారని, దీంతో  జిల్లాల్లోని అభ్యర్థులకు 130 మార్కులు వచ్చినా ఉద్యోగం రాని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జిల్లాలో 80 మార్కులకే జాబ్​ వచ్చే అవకాశం ఉందన్నారు. నోటిఫికేషన్ లో ఎక్కడా జిల్లాల ప్రస్తావన లేదని, సెలక్షన్ సమయంలోనే జీవోను తెరపైకి  తెచ్చారన్నారని మండిపడ్డారు. వెంటనే  జీవో నెం.46ను రద్దు చేయాలని లేదంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతుండగా అభ్యర్థులను పోలీసులు అరెస్ట్ చేసి నాగోల్ పీఎస్ కు తరలించారు.