హైదరాబాద్ లోని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ఆందోళనకు దిగారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తమకు మానసికంగా , లైగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. తను చెప్పినట్లు వినకపోతే దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారని ఆరోపించారు. తన కొడుకు పెళ్లికి కూడా సెలవు ఇవ్వడం లేదంటూ ఓ కార్మికురాలు కన్నీరు పెట్టుకున్నారు.
విధులు బహిష్కరించి రోడ్డుపై బైటాయించారు కార్మికులు. పై అధికారులకు తమ సమస్యను చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ వైజర్ ను తొలిగించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు కార్మికులు.