గిరిజన గురుకుల విద్యార్థుల ఆందోళన

గిరిజన గురుకుల విద్యార్థుల ఆందోళన

నిర్మల్ జిల్లా: ముథోల్ గిరిజన గురుకుల విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్ లో వసతులు సరిగ్గా లేవని ఆరోపించారు. ఐదు రోజులుగా నీళ్లు వస్తలేవని.... ప్రిన్సిపాల్ కి చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. హాస్టల్ గ్రౌండ్ లో బైఠాయించిన విద్యార్థినీలు.. ప్లేట్లు పట్టుకొని రోడ్డుపైకి వచ్చి వియ్ వాంట్.. వాటర్.. అంటూ నినాదాలు చేస్తూ.. నిరసన తెలిపారు.
హాస్టల్లో మెస్ కూడా సరిగా లేదని, అన్నంలో పురుగులొస్తున్నాయన్నారు. అన్నం బాగా లేదని.. పురుగులొచ్చాయని చూపించినా ఎవరూ పట్టించుకోలేదన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.