గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీతో సీఎం చర్చలు

గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీతో సీఎం చర్చలు

హైదరాబాద్:  తెలంగాణలో రియల్ ఎస్టేట్, ఫర్నీచర్, కన్సూమర్ గూడ్స్ రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలను పరిశీలించాలని  గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులకు సీఎం రేవంత్​రెడ్డి సూచించారు. ఇవాళ  సెక్రెటేరియట్ లో గోద్రెజ్ అగ్రోవెట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం సింగ్ యాదవ్ తో పాటు కంపెనీ ప్రతినిధులు సీఎంరేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. 

ఈ సందర్భంగా ఇప్పటికే కంపెనీ చేపట్టిన ఆయిల్ పామ్, డెయిరీ బిజినెస్ ను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా స్కిల్ డెవలప్‌మెంట్‌ ను ప్రోత్సహించాలని కంపెనీ ప్రతినిధులకు  సూచించారు. తెలంగాణలో ఇప్పటికే ఈ కంపెనీ పలు వ్యాపారాలు నిర్వహిస్తోంది.  మలేషియాకు చెందిన సిమ్ డార్బీ కంపెనీతో కలిసి ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటేడ్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ కాంప్లెక్స్ ను ఈ కంపెనీ ఏర్పాటు చేస్తోంది. సమావేశంలో   ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్​ శాంతికుమారి, అధికారులు పాల్గొన్నారు.