
హైదరాబాద్, వెలుగు: -స్కైలార్క్ పేరుతో ఏఐ/ఎంఎల్ పవర్డ్ క్లౌడ్- ఆధారిత లొకేషన్ సేవను ప్రారంభించడానికి ఎయిర్టెల్ బిజినెస్, స్విఫ్ట్ నావిగేషన్తో చేతులు కలిపింది. స్కైలార్క్ టెక్నాలజీని ఎయిర్టెల్ పాన్-ఇండియా 4జీ/5జీ నెట్వర్క్తో కలిపి, మిషన్- క్రిటికల్ లొకేషన్- ఆధారిత అప్లికేషన్ల కోసం వాడుతారు.
సెంటీమీటర్ -స్థాయి కచ్చితమైన పొజిషనింగ్ ప్లాట్ఫారమ్ను ఇది అందిస్తుంది. అంటే లొకేషన్ను చాలా కచ్చితంగా తెలుసుకోవచ్చు. జీపీఎస్ కంటే ఇది 100 రెట్లు ఎక్కువ కచ్చితంగా పనిచేస్తుంది.ఇది ఎమర్జెన్సీ రెస్పాన్స్, ఆటానమస్ మొబిలిటీ, శాటిలైట్-ఆధారిత టోల్ వసూళ్లు, డిజిటల్ మ్యాపింగ్ వంటి వాటిని సులభతరం చేస్తుంది.