న్యూఢిల్లీ: ఈకామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది మే–జూన్ మధ్య బెంగళూరులో పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేసి, 2026 చివరికి లేదా 2027 ప్రారంభంలో పూర్తి స్థాయి సేవలను అందించాలని ఆలోచిస్తోందని ఎకనమిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది. సొంత ప్లాట్ఫారమ్ ద్వారా లేదా ఓఎన్డీసీ ద్వారా పనిచేయాలా అనే విషయంలో తుది నిర్ణయానికి రాలేదు.
ఈ రిపోర్ట్తో జొమాటో, స్విగ్గీ షేర్లు గురువారం 3శాతం వరకు పడిపోయాయి. ప్రస్తుతం 9 బిలియన్ డాలర్ల విలువైన ఫుడ్ డెలివరీ మార్కెట్లో ఈ రెండు కంపెనీల ఆధిపత్యం కొనసాగుతోంది. ఎటర్నల్ (జొమాటో) షేర్ 1.6శాతం తగ్గి రూ.295.9 వద్ద, స్విగ్గీ షేర్ 3శాతం తగ్గి రూ.331.75 వద్ద ట్రేడ్ అయ్యాయి. ఇటీవల బైక్ ట్యాక్సీ రాపిడో కూడా ఫుడ్ డెలివరీలోకి ఎంటర్ అయింది.
