- రిపీటెడ్ వయలేషన్లను గుర్తించి యాక్షన్
- ఔటర్పై వాహనం ఆగిపోతే 14449 సమాచారం ఇవ్వాలి
- కోఆర్డినేషన్ మీటింగ్లో సీపీ వీసీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రజా భద్రత బలోపేతంపై హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ అధ్యక్షతన శుక్రవారం బంజారాహిల్స్ టీజీఐసీసీసీలో కో ఆర్డినేషన్మీటింగ్నిర్వహించారు. ఇందులో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ రోహిత్ గోపిడి, ఎన్హెచ్ఏఐ, జీహెచ్ఎంసీ, హెచ్జీసీఎల్, ఐఆర్బీ ఇన్ఫ్రా ప్రతినిధులు, హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసు అధికారులు పాల్గొని చర్చించారు. ఈ ఏడాది మే నెలలో నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలుపై సమీక్షించి రోడ్డు భద్రతకు సంబంధించిన చర్యలను పరిశీలించారు.
80 క్రిటికల్ స్పాట్స్ గుర్తింపు
సజ్జనార్ మాట్లాడుతూ.. ఓఆర్ఆర్పై ప్రమాదాలు ఎక్కువగా జరిగే 80 క్రిటికల్ స్పాట్లను గుర్తించామని, వాటిలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ను కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు. ప్రమాదాల నివారణకు ఏఐ ఆధారిత ఎలక్ట్రానిక్ ఎన్ఫోర్స్మెంట్ సిస్టమ్ను అమల్లోకి తీసుకురావడంపై పరిశీలన జరుగుతోందన్నారు.
ఈ వ్యవస్థ ద్వారా ట్రాఫిక్ వయలేషన్స్ను వేగంగా గుర్తించి, పదేపదే రూల్స్బ్రేక్చేసే వాహనదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఓఆర్ఆర్పై నమోదవుతున్న ఉల్లంఘనల్లో దాదాపు 99 శాతం వాహనాలు రీపీటెడ్ వయలేషన్స్కు పాల్పడుతున్నాయన్నారు. వీరిని మార్చేందుకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.
ఓఆర్ఆర్పై వాహనాలు బ్రేక్డౌన్ కావడం వల్ల కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, అలాంటి వాహనాలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఓఆర్ఆర్పై ఎట్టి పరిస్థితుల్లో వాహనాలను నిలపరాదని, వాహనం ఆగిపోతే 14449 హెల్ప్లైన్కు సమాచారం ఇవ్వాలని కోరారు.
బ్లాక్స్పాట్స్ వద్ద రక్షణ చర్యలు
హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఓఆర్ఆర్పై అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు హెచ్ఎండీఏ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్ల వద్ద రక్షణ చర్యలను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. హైదరాబాద్ అడిషనల్సీపీ తప్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయల్ డేవిస్, సైబరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ సన్ప్రీత్ సింగ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఐఆర్బీ, ఎన్హెచ్ఏఐ, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, ట్రాఫిక్ డీసీపీలు, అదనపు డీసీపీలు తదితరులు పాల్గొన్నారు.
