
హైదరాబాద్, వెలుగు: కమిటీల పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై కాలక్షేపం చేస్తున్నదని ఏఐసీసీ కార్య దర్శి సంపత్ కుమార్ విమర్శించారు. దళితులను మోసం చేసేందుకే మరోసారి కమిటీ అంటూ డ్రామాలు ఆడుతున్నదన్నారు. శనివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని రాష్ట్రాల్లోనూ ఉద్యమం జరిగిందని, ఉమ్మడి ఏపీలో 2004లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసిందని గుర్తు చేశారు.
ఆ వెంటనే నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి అఖిలపక్షాలన్నీ వెళ్లి తీర్మానం కాపీని అందజేశాయని, ఆమె ఆమోదించడంతో ప్రభుత్వం ఉషా మెహ్రా కమిటీ వేసిందని చెప్పారు. 2008లో కమిటీ రిపోర్ట్ఇచ్చినా.. నాటి ఉద్యమ పరి స్థితుల నేపథ్యంలో కమిటీ సిఫార్సులు అమలు కాలేదని చెప్పారు. రాష్ట్రాలకు స్వేచ్ఛనిచ్చేలా రిపోర్లులో పేర్కొన్నారని గుర్తుచేశారు.
అయితే, ఆ తర్వాత అధికారం లోకి వచ్చిన బీజేపీ సర్కారు.. ఉషా మెహ్రా కమిటీ రిపోర్ట్ ఆధారంగా ఎస్సీ వర్గీకరణ చేసేందుకు అవకాశం ఉన్నా చేయలేదని విమర్శించారు. పది నిమిషాల్లో చేయతగి న పనిని.. పదేండ్లవుతున్నా పూర్తి చేయలే దని మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల వేళ మళ్లీ కమిటీల పేరుతో డ్రామాలు ఆడుతున్నదన్నారు. కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎస్సీ వర్గీకరణను అమలు చేసి దళితులపై ప్రేమ చూపించాలన్నారు.