నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వండి..సోనియా గాంధీకి సంపత్ లేఖ

నాగర్ కర్నూల్ టికెట్ ఇవ్వండి..సోనియా గాంధీకి సంపత్ లేఖ

హైదరాబాద్, వెలుగు :  నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ తనకు కేటాయించాలని ఏఐసీసీ మాజీ ప్రెసిడెంట్ సోనియా గాంధీకి ఏఐసీసీ సెక్రటరీ, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ బుధవారం లేఖ రాశారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 17,30,781 మంది ఓటర్లు ఉండగా, ఇందులో తన సామాజిక వర్గం అయిన మాదిగ ఓటర్లు 3,75,532 మంది ఉన్నారని, మాల సామాజిక వర్గం ఓటర్లు 62,801 మంది ఉన్నారని పేర్కొన్నారు.

ఏఐసీసీ నేతలు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్​కు మల్లు రవి పేరు మాత్రమే పంపారని, ఆయన గత 4 ఎన్నికల్లో ఓడిపోయారన్నారు. మల్లు రవి ప్రస్తుతం కేబినెట్ హోదాతో ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్నారని గుర్తుచేశారు. 30 ఏళ్ల నుంచి పార్టీలో ఉన్నానని, ఎన్ఎస్ యూఐ

యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చానని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నానని, రాహుల్​తో జోడో యాత్రలో ఎక్కువ రోజులు పాల్గొన్నానని పేర్కొన్నారు. తనకు టికెట్ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు.