మంద జగన్నాథంతో సంపత్ కుమార్​ భేటీ

మంద జగన్నాథంతో సంపత్ కుమార్​ భేటీ

మానవపాడు, వెలుగు: అలంపూర్  నియోజకవర్గంలో తేనేటి విందు రాజకీయాలు కలకలం రేపుతున్నాయి. మాజీ ఎంపీ, ఢిల్లీలో అధికార ప్రతినిధి మంద జగన్నాథంతో ఏఐసీసీ సెక్రటరీ, అలంపూర్  కాంగ్రెస్  అభ్యర్థి సంపత్ కుమార్  శుక్రవారం ఇటిక్యాల మండలం కొండేరు గ్రామంలోని ఆయన ఇంట్లో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్  బీఆర్ఎస్  అభ్యర్థి విజయుడు కార్యకర్తలతో కలిసి తరలివెళ్లి జగన్నాథంను కలిశారు. బీఆర్ఎస్  పార్టీలో ఉన్న జగన్నాథంను ఏఐసీసీ సెక్రటరీ ఎందుకు కలిశాడనే విషయం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పార్టీ టికెట్  కోసం మంద జగన్నాథం కొడుకు మంద శ్రీనాథ్  పోటీ పడ్డారు. అసంతృప్తితో ఉన్న ఆయనను పార్టీలోకి ఆహ్వానించారనే విషయం తేలాల్సి ఉంది.