
హైదరాబాద్: దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు ఏఐసీసీ ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్. కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం జరుగుతుంది..దేశంలో సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ, 42 బీసీ రిజర్వేషన్లు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసింది ఒక్క కాంగ్రెస్సే అన్నారామె.
జూబ్లీహిల్స్ఉపఎన్నికలో కాంగ్రెస్అభ్యర్థిని గెలిపించేందుకు ఐక్యంగా కృషి చేయాలన్నారు. ప్రతిఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నారు. పేదలకు అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు మీనాక్షీ నటరాజన్.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత కరెంట్, ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టబోతోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నంటిని పూర్తి చేస్తుందన్నారు.