మోడీజీ.. ప్రజల రక్తం మీకు సువాసనలా అనిపిస్తోందా?

మోడీజీ.. ప్రజల రక్తం మీకు సువాసనలా అనిపిస్తోందా?

హైదరాబాద్: కరోనాతో ప్రజలు చనిపోతుంటే ప్రధాని మోడీ అండ్ కో చూస్తూ సంతోషిస్తున్నారని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. మోడీ సర్కార్ ఎవరికీ కనిపించకుండా అదృశ్యం అయిపోయిందని కామెంట్ చేశారు. ‘కరోనాతో చాలా మంది చనిపోతున్న వారిలో కొందర్ని ఖననం చేస్తున్నారు, మరికొందర్ని దహనం చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మోడీ అండ్ కోకు చాలా సంతోషమేస్తున్నట్లుంది. ప్రజల రక్తం వీరికి సువాసనలా తోస్తున్నట్లుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ కొరత ఎందుకొచ్చింది? అలాగే ఫైజర్ టీకాకు ముందే అనుమతి ఎందుకు ఇవ్వలేదు? ఎంపీ ఫండ్స్ కేంద్రమే తీసుకుంది. మా దగ్గర నిధులు ఉండుంటే మేం జనాలకు మెడిసిన్స్, ఆక్సిజన్ అందించే వాళ్లం. పీఎం కేర్స్ ఫండ్స్‌‌ను రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు కేంద్రం వినియోగించాలి. మోడీ మీడియా చంచాల్లారా.. ఇప్పటికైనా మేల్కోండి. మీ సొంత మనుషులూ చనిపోతున్నారు. మోడీ భజన చేయడం మానండి’ అని అసదుద్దీన్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు.