ముంబై నుంచి అమెరికాలో నెవార్క్ వెళుతున్న ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో అలర్టైన సిబ్బంది ఆ విమానాన్ని మార్గమధ్యంలోనే లండన్లోని స్టాన్ స్టెడ్ ఎయిర్పోర్టులో అత్యవసరంగా దింపివేశారు. గురువారం ఎయిరిండియాకు చెందిన AI 191 విమానం గాల్లో ఉండగా విమానంలో బాంబులు అమర్చినట్లు బెదిరింపు సమాచారం అందింది. దీంతో బ్రిటన్కు చెందిన రాయల్ ఎయిర్ఫోర్స్ టైఫూన్ జెట్ విమానాలు ఎయిరిండియా విమానాన్ని అనుసరించాయి. పూర్తిగా తనిఖీలు చేసే సమయంలో రన్ వేపై ఇతర విమానాలను అనుమతించలేదు. ఎయిర్ పోర్టును కూడా మూసివేశారు. తనిఖీలు నిర్వహించి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించాకే విమానాశ్రయం కార్యకలాపాలు పునఃప్రారంభించారు.