
హైదరాబాద్: గుజరాత్ విమానం ప్రమాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన A171 విమానం టేకాఫ్ సమయంలో కుప్పకూలడం అత్యంత దురదృష్టకరమన్నారు. విమానంలో 200 లకు పైగా ప్రయాణికులున్నట్టు చెబుతున్నారని, వారంతా సురక్షితంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. బాధితులకు అవసరమైన తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
Also Read : అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం
కాగా, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నాం విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది. ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని జనవాసాల్లో కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు 100 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది.