
అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన తర్వాత ఫ్లైట్ జర్నీ అంటేనే ప్రయాణికులు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ తర్వాత కూడా ఫ్లైట్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం విమానయాన శాఖను ఆందోళనకు గురి చేసింది. భద్రతా చర్యలపై మార్గదర్శకాలు జారీ చేసింది.
ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత సంస్థ రెప్యుటేషన్ కాపాడేందుకు, కస్టమర్లలో విశ్వాన్ని నిపేందుకు సంస్థ యాజమాన్యం టాటా గ్రూప్ చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా సమస్యలు ఉన్నట్లు భావిస్తున్న 38 విమానాలను సస్పెండ్ చేశారు. జూన్ 21 నుంచి జులై 15 మధ్య తిరిగే వీక్లీ ఫ్లైట్లను కొన్నాళ్లపాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.
ముఖ్యంగా ఢిల్లీ-నైరోబీ, అమృత్ సర్-లండన్ గత్విక్, గోవా-లండన్ గాత్విక్ మార్గాలలో తిరిగే ఫ్లైట్ లను టెస్టింగ్ కోసం కొన్నాళ్లపాటు సస్పెండ్ చేశారు. 18 అంతర్జాతీయ రూట్లలో ఫ్లైట్లను సస్పెండ్ చేశారు. షెడ్యూల్ మెయింటెనెన్స్, ప్యాసెంజర్లకు చివరి నిమిషం వరకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు కావాల్సిన ప్రణాళికలు చేస్తున్నట్లు పేర్కొంది.
ఈ 18 రూట్లలో విమానాల నిలిపివేత:
నార్త్ అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా సహా మొత్తం 18 అంతర్జాతీయ మార్గాలలో ఎయిర్ ఇండియా ఫ్లైట్లను నిలిపివేస్తోంది. అవి:
ఢిల్లీ–టొరంటో,
ఢిల్లీ–వాంకోవర్,
ఢిల్లీ–శాన్ ఫ్రాన్సిస్కో,
ఢిల్లీ–చికాగో,
ఢిల్లీ–వాషింగ్టన్ డిసి.
యూరోపియన్ మార్గాలలో తక్కువ ఫ్లైట్లు:
ఢిల్లీ–లండన్ హీత్రో,
బెంగళూరు–లండన్ హీత్రో,
అమృత్సర్–బర్మింగ్హామ్,
ఢిల్లీ–బర్మింగ్హామ్, ఢిల్లీ–పారిస్,
ఢిల్లీ–మిలన్, ఢిల్లీ–కోపెన్హాగన్, ఢిల్లీ–వియన్నా,
ఢిల్లీ–ఆమ్స్టర్డామ్
ఆస్ట్రేలియా రూట్లలో:
ఢిల్లీ–మెల్బోర్న్
ఢిల్లీ–సిడ్నీ
ఢిల్లీ–టోక్యో హనేడా
ఢిల్లీ–సియోల్ (ఇంచియాన్)
సవాలుగా మారిన సేఫ్టీ చెక్స్:
బోయింగ్ ఫ్లైట్స్ సేఫ్టీ ఎయిర్ ఇండియాకు సవాలుగా మారింది. బోయింగ్ 787 మోడల్స్ విమానాలలో ఎక్కవ శాతం సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అదే విధంగా బోయింగ్ 777 లో కూడా సమస్యలు తలెత్తుతున్న తరుణంలో భద్రతా తణిఖీలు, పరీక్షలు నిర్వహించే ఉద్దేశంతో ఫ్లైట్లను నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా సీఈఓ క్యాంప్ బెల్ విల్సన్ తెలిపారు. ఇటీవల జరుగుతున్న ప్రమాదాలు, సాంకేతిక సమస్యలపై ప్యాసెంజర్ల నుంచి క్షమాపణ కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు హామీ ఇచ్చారు.
బోయింగ్ డ్రీమ్లైనర్ 787-8 విమానాల సముదాయానికి చెందిన AI 171 అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని సెకన్లకే కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 274 మంది మృతి చెందినట్లు అధికారికంగా ప్రకటించారు.