- భారత్, యూరప్లో అంతరాయం
న్యూఢిల్లీ: ఎయిర్లైన్స్ సంస్థలకు సాఫ్ట్ వేర్ సేవలు అందించే నావిటైన్ సిస్టమ్లో టెక్నికల్ సమస్య కారణంగా గురువారం ఇండియాతోపాటు యూరప్ దేశాల్లోని పలు ఎయిర్పోర్టుల్లో సేవలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా ఢిల్లీలో ఏఐ సమిట్కు వస్తున్నవారు ఇబ్బందులు పడ్డారు. నావిటైన్ సిస్టమ్ రిజర్వేషన్, డిపార్చర్ కంట్రోల్లో కీలకంగా పనిచేస్తుంది.
మన దేశంలో ఎయిర్ఇండియా మినహా ఇతర అన్ని ఎయిర్లైన్స్లు దీనిని ఉపయోగిస్తాయి. ఉదయం 6:45 నుంచి 7:28 వరకు, మళ్లీ 8:10 నుంచి 8:25 వరకు సిస్టమ్లో సమస్యలు తలెత్తాయి. దీంతో చెక్-ఇన్, బోర్డింగ్ ప్రక్రియల్లో డిలే ఏర్పడి, ప్రయాణికులు గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వచ్చింది. ఏఐ సమిట్ కారణంగా హైప్రొఫైల్ ప్రతినిధుల రాకపోకలు కూడా ఉండటంతో టెర్మినల్స్ పై అదనపు ఒత్తిడి పడింది.
