కరోనా బారినపడ్డ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య

కరోనా బారినపడ్డ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య కొవిడ్ బారినపడ్డారు. లక్షణాలు ఉండటంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా నిర్థారణ అయింది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.
"అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడ్డాను. హాస్పిటల్ లో చేరాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. 2022 నాకోసం ఇంకేం తీసుకొస్తావో చూస్తాను" అంటూ ఇన్స్టాగ్రాంలో పోస్ట్ పెట్టింది. అది చూసిన అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.