ఐశ్యర్య రాజేష్ కొత్త చిత్రం షురూ ..

ఐశ్యర్య రాజేష్ కొత్త చిత్రం షురూ ..

రీసెంట్‌‌‌‌గా ‘ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో సక్సెస్ అందుకుని మంచి జోష్‌‌‌‌లో ఉన్న తిరువీర్ తాజాగా తన కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేశాడు.   ‘సంక్రాంతికి వస్తున్నాం’ విజయం తర్వాత ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  భరత్ దర్శన్  డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని  గంగా ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. 

ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని  ప్రారంభించారు.  చిత్ర యూనిట్ సభ్యులంతా ఈ కార్యక్రమానికి  హాజరయ్యారు.  హిలేరియస్ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌గా తెరకెక్కనున్న ఈ సినిమా  ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని, ఈ నెల 19వ తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని  దర్శక నిర్మాతలు తెలియజేశారు.

  ఈ  సినిమా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నట్టు చెప్పారు.  ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు ఈ  చిత్రానికి  సంగీతం అందిస్తున్నాడు.