ప్రొటెం స్పీకర్ గా  అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం

ప్రొటెం స్పీకర్ గా  అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం

హైదరాబాద్, వెలుగు : అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒవైసీ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయనకు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,  కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ ఎస్ నుంచి మాజీ మంత్రి హరీశ్​ రావు పాల్గొన్నారు. అనంతరం అసెంబ్లీకి చేరుకున్న ప్రొటెం స్పీకర్ కు పలువురు మంత్రులు, అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు స్వాగతం పలికారు.